- Advertisement -
జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం లింగంపేటలో విషాదం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని డిగ్రీ విద్యార్థి శివలింగం (24) బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పేర్కొన్న విద్యార్థి, జీవితంపై విరక్తితోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విద్యార్థి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Student Commits Suicide in Mahabubnagar
- Advertisement -