Friday, March 29, 2024

వడూర్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం

- Advertisement -
- Advertisement -

Student role like as teachers

మన తెలంగాణ/నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వడూర్ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సర్వపల్లి రాధాకృష్ణన్ చిత్రపాటానికి పూల మాల వేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి మాట్లాడుతూ.. సర్వపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో అయన చేసిన సేవలు మరవలేవని, ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. అనంతరం విద్యార్థులకు బుక్క రాములు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాధర్, తదితరులు విద్యార్థులు పాల్గ్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News