- Advertisement -
-కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధన లు ఉల్లంఘించినా పోలీసులు పట్టుకోకుండా మోటార్ సైకిల్ నంబర్ ప్లేట్కు మాస్కు పెట్టిన వ్యక్తి పై పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో లాక్డౌన్ ఎత్తి వేసిన తర్వాత చాలామంది యువకులు బైక్లకు మాస్కులు పెట్టి యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో పోలీసులకు బైక్ నంబర్ను గుర్తించి జరిమానా వేసేందుకు వీలుకావడంలేదు. దీనిపై నిఘా పెట్టిన ట్రాఫిక్ పోలీసులు వారిని పట్టుకునే పనిలో ఉన్నారు.
- Advertisement -