Tuesday, March 19, 2024

సహజీవనం… మహిళను తుపాకీతో కాల్చిన ఎస్ఐ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తనతో సహజీవనం చేస్తున్న మహిళను ఎస్ఐ గన్ తో కాల్చి నడిరోడ్డుపై పడేసిన సంఘటన ఢిల్లీలోని అలీపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లాహోరీ గేట్‌లో ఎస్‌ఐగా సందీప్ దహియా పని చేస్తున్నాడు. సందీప్ తన భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. మరో మహిళతో పరిచయం కావడంతో ఆమెతో గత సంవత్సరం నుంచి ఎస్ఐ సహజీవనం చేస్తున్నాడు. ఆదివారం ఇద్దరు కలిసి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే సందీప్ తుపాకీ తీసి ఆమెను కాల్చాడు. అనంతరం కారులో నుంచి ఆమెను రోడ్డుపై నెట్టేసి వెళ్లిపోయాడు. అదే ప్రాంతంలో ఎస్‌ఐగా పని చేస్తున్న జైవీర్ ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. సరైన సమయానికి ఆమె తీసుకరావడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎస్‌ఐ సందీప్ దహియా తనపై కాల్పులు జరిపాడని ఆమె పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిసిపి గౌరవ్ శర్మ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News