- Advertisement -
ఖార్టూమ్: సూడాన్లో మిలిటరీ బలగాలు అనేక మంది సివిల్ నాయకులను సోమవారం ఉదయం అరెస్టు చేశాయి. ఆ దేశ ప్రధాని అబ్దుల్లా హమ్ దోక్ ను గృహ నిర్బంధంలో ఉంచాయి. ఈ విషయాన్ని అల్ హదత్ టివి పేర్కొంది. మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రముఖ ప్రజాస్వామ్య గ్రూపు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతానని ప్రకటించింది.
సూడాన్లో గత నెలలోనే మిలిటరీ గ్రూపులకు, సివిల్ గ్రూపులకు మధ్య పొరపొచ్చలు వచ్చాయి. గత నెలే తిరుగుబాటు విఫలమైంది. 2019లో మాజీ నాయకుడు ఉమర్ బహీర్ పదవీచ్యుతుడయ్యాక మిలిటరీ, సివిల్ గ్రూపులకు మధ్య అధికార పంపిణీ విషయంలో తేడాలు వచ్చాయి.
- Advertisement -