Saturday, April 20, 2024

పాక్‌లో మానవ బాంబు పేలుడు

- Advertisement -
- Advertisement -
Suicide bomb attack in Pakistan
ఇద్దరు పిల్లలు మృతి, ముగ్గురికి గాయాలు

కరాచి: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో శుక్రవారం చైనా జాతీయులను తీసుకువెళుతున్న ఒక వాహనంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పిల్లలు మరణించగా ఒక చైనా జాతీయుడితోసహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. చైనా కార్మికులు, చైనా పెట్టుబడులు ఎక్కువగా ఉండే రేవు నగరం గ్వాదలోని బలోచ్ వార్డ్ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. సమీపంలోని ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు మరణించగా ఒక చైనా జాతీయుడికి గాయాలయ్యాయని, డ్రైవర్‌తో సహా ముగ్గురు గాయపడ్డారని బలోచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. వాహనం సమీపానికి వచ్చిన మానవ బాంబు తనను తాను పేల్చుకుని మరణించాడని ఆయన చెప్పారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించలేదని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News