Saturday, April 20, 2024

సోమాలియాలో అధ్యక్ష భవనం వద్ద ఆత్మాహుతి దాడి: 10మంది మృతి

- Advertisement -
- Advertisement -

Suicide bomber strikes at presidential palace in Somalia

 

మొగదీష్: సోమాలియాలో శనివారం అల్‌ఖైదాకు చెందిన ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో 10మంది చనిపోగా,20మంది గాయపడ్డారు. సోమాలియాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ప్రవేశ ద్వారం వద్ద ఈ దాడి జరిగింది. చెక్‌పోస్ట్ వద్ద కార్లు, ట్రక్కులపైకి పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో ఉగ్రవాది ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సోమాలియా నిఘా చీఫ్ ఖలీఫ్ అహ్మద్ గాయపడ్డారు. సోమాలియా రాజధాని మగదీష్‌లోని ఎయిర్‌పోర్టుకు ఆ దేశ అధ్యక్షుడు, ప్రధాని ఈ చెక్‌పోస్ట్ ద్వారా వెళ్తారు. తామే ఈ దాడికి పాల్పడ్డామని అల్‌ఖైదాతో లింక్‌లున్న అల్‌షబాబ్ ప్రకటించింది. మొగదీష్‌లో గతంలోనూ పలు ఆత్మాహుతి దాడులకు అల్‌ఖైదా తెగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News