- Advertisement -
కరీంనగర్: జిల్లాలోని బొమ్మకల్ వద్ద రాజీవ్ రహదారిపై ట్రక్కు-కారు ఢీకొని రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ఏఎస్ఐ తిరుపతి అక్కడికక్కడే మృతి చెందారు. సుల్తానాబాద్ లో విధులు ముగించుకుని కరీంనగర్ కు మంగళవారం రాత్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
Sultanabad ASI death in Road Accident Karimnagar
- Advertisement -