Friday, April 19, 2024

ఎపిలో మే 9 నుంచి పాఠ‌శాలలకు వేసవి సెలవులు

- Advertisement -
- Advertisement -

Summer holidays from May 9 for schools in AP

ఈ నెల 27 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు
1 నుంచి 9 త‌ర‌గ‌తుల‌కు మే 4 వ‌ర‌కు స‌మ్మేటివ్‌-2 ప‌రీక్ష‌లు
టెన్త్ ప‌రీక్ష‌లు ముగియ‌గానే స‌మ్మ‌ర్ హాలిడేస్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్: ఎపిలో మే 9 నుంచి పాఠ‌శాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం జులై 4 నుంచి మొద‌లు కానుంది. ఈ మేర‌కు శ‌నివారం ఎపి విద్యాశాఖ శనివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు మొద‌లుకానున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్ష‌లు ఈ నెల 27 నుంచి మే 9 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ఈ పరీక్షలు పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప‌రీక్ష‌లు పూర్తి కాగానే వారికి వేస‌వి సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల అనంతరం జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. ఏపీలోని జూనియర్‌ కాలేజీలకు మే 25 నుంచి జూన్‌ 20 వరకు సమ్మర్‌ హాలిడేస్‌ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణ‌యించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News