- Advertisement -
న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ సునీల్ కుమార్ స్వర్ణం సాధించాడు. మంగళవారం జరిగిన 87 కిలోల గ్రికో రొమాన్ విభాగంలో సునీల్ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో కజకిస్థాన్ రెజ్లర్ సాలిడినోవ్ను ఓడించాడు. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన సునీల్ ప్రత్యర్థిని చిత్తు చేసి స్వర్ణం దక్కించుకున్నాడు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ పోటీల్లో భారత్కు సునీల్ తొలి స్వర్ణాన్ని అందించాడు. ఇక, అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సునీల్ కుమార్ చెమటోడ్చి నెగ్గాడు. కజకిస్థాన్కే చెందిన అజ్మత్తో జరిగిన హోరాహోరీ సమరంలో సునీల్ 128తో సంచలన విజయం సాధించి ఫైనల్కు అర్హత సాధించాడు. కాగా, భారత రెజ్లర్లు అర్జున్, మెహార్ సింగ్లు సెమీఫైనల్లోనే ఓటమి పాలయ్యారు.
Sunil Kumar wins gold in Asian Wrestling Championship
- Advertisement -