Saturday, April 20, 2024

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

- Advertisement -
- Advertisement -

తిరుచానూరు: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ జస్టిస్ చంద్ర చూడ్ కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్ర చూడ్ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు . అనంతరం ఆశీర్వాద మండపంలో సిజె ఐ కి చైర్మన్,ఈవో అమ్మవారి ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సన్మానించారు. జిల్లా జడ్జి శ్రీ వీర్రాజు , టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి , విజివో శ్రీ మనోహర్, అదనపు ఎస్పీ శ్రీ కులశేఖర్, డిఎస్పీ శ్రీ మురళీ కృష్ణ,ఆలయ ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబు స్వామి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News