Friday, April 26, 2024

తిరుమలలో కరోనా కలకలం.. భక్తుడికి అస్వస్థత

- Advertisement -
- Advertisement -

Tirumala

మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక పుణ్యక్షేత్రాల్లోనూ కరోనా కలకలం కనిపిస్తోంది. తాజాగా తిరుమల క్షేత్రంలోనూ ఓ భక్తుడికి కరోనా వచ్చిందన్న ఆరోపణల నేపథ్యంలో స్థానికంగా భక్తుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మహారాష్ట్రకు చెందిన ఆ భక్తుడు వారణాసిని సందర్శించిన అనంతరం తిరుమల వచ్చాడు. ప్రస్తుతం అతడు తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్టు టిటిడి అధికారులు గుర్తించారు. ఆ భక్తుడిని తిరుమలలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలో తిరుపతి అలిపిరి వద్ద చెక్ పోస్టును మూసివేసి, తిరుమలకు వాహనాలను నిలిపివేశారు. చెక్ పోస్టు మూసివేతతో అలిపిరి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Suspected Corona Case in Tirumala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News