- Advertisement -
విశాఖపట్నం : విశాఖలో దారుణం చోటుచేసుకుంది. సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్న ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్ కత్తితో దాడి చేశాడు. అనంతరం శ్రీకాంత్ ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖలోని ఫెర్రి జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ప్రియాంక మరో యువకుడితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో శ్రీకాంత్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -