Saturday, April 20, 2024

భార‌త్ టార్గెట్ 133 పరుగులు..

- Advertisement -
- Advertisement -

అబుధాబి: టీ20 ప్రపంచకప్ సూప‌ర్ 12లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న చివరి మ్యాచ్ లో న‌మీబియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో నమీబియా, టీమిండియాకు 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. నమీబియా బ్యాట్స్ మెన్లలో వీస్(26), బార్డ్(21)లు పర్వాలేదనిపించినా.. మైకెల్(14), గెర్హార్డ్(12), స్మిత్(9), హెరాస్మస్(12)లు విఫలమయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌డేజా, అశ్విన్ చెరో 3 వికెట్లు తీయగా.. బుమ్రా రెండు వికెట్లు తీశారు.

T20 World Cup: India Needs 133 runs to win against NAM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News