Friday, March 29, 2024

చెలరేగుతున్న సఫారీ బౌలర్లు.. విండీస్ మూడో వికెట్ డౌన్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్‌ మూడో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ఓపెనర్లు నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ఆరంభించారు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన నికోలస్ పూరన్(12)ను కేశవ్ మహరాజ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో విండీస్ 13.2 ఓవర్లలో 89 పరుగులకు మూడు కీలక వికెట్లను చేజార్చుకుంది. అంతకుముందు భారీ బౌండరీలతో విరుచుకుపడిన ఓపెనర్ ఎవిన్ లూయిస్(56)ను కూడా కేశవ్ మహరాజ్ ఔట్ చేశాడు. మరో ఓపెనర్ సిమ్మన్స్(16)ను రబాడా పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం విండీస్ జట్టు 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో పోలార్డ్(4), గేల్(3)లు ఉన్నారు.

T20 World Cup: WI lost 3 wickets at 89 against SA 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News