Tuesday, April 23, 2024

‘మిషన్ ఇంపాజిబుల్’తో రీ ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

 

‘ఝుమ్మందినాధం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టిన సొట్టబుగ్గల సుంద రి తాప్సీ… ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, గుండెల్లో గోదారి, సాహసం, ఘాజీ, ఆనందో బ్రహ్మ, నీవెవరో వంటి చిత్రాలతో మెప్పించింది. ఈ క్రమం లో బాలీవుడ్‌లో అడుగుపెట్టి వరుస సినిమాలతో అక్కడ సత్తా చాటుతోంది. చివరగా ‘గేమ్ ఓవర్’ అనే హిందీ, తెలుగు బైలింగ్విల్‌లో కనిపించిన తాప్సీ.. మళ్ళీ టాలీవుడ్‌కి రావడానికి మంచి కథ కోసం ఎదురుచూసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్’ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వంలో ఈ సిని మా తెరకెక్కుతోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తాప్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ బ్యూటీ.. తాజాగా షూటింగ్‌లో చేరింది. ఈ నేపథ్యంలో తాప్సీకి సంబంధించిన ఓ వర్కింగ్ స్టిల్ ని ఫిల్మ్‌మేకర్స్ షేర్ చేశారు. ఇందులో తాప్సీ విరిగిన చేతికి కట్టుకట్టుకొని ల్యాప్‌టాప్ ముందు కూర్చొని ఏదో ఆతృతగా చూస్తూ ఉంది. కాగా దర్శకుడు స్వరూప్.. మరోసారి డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీతో వస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News