Saturday, April 20, 2024

లష్కర్ బోనాల ఏర్పాట్లపై మంత్రులు అల్లోల, త‌ల‌సాని సమీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లష్కర్ బోనాల సందర్భంగా భక్తుల రద్ధీని దృష్టిలో పెట్టుకొని ముందుగానే క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. లష్కర్ బోనాల ఏర్పాటుపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు.  బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో రోడ్లు మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. దేవాలయాల దగ్గర లైటింగ్ సౌకర్యాలతో పాటు ఆలయానికి వచ్చే దారులన్నీ సుందరంగా తీర్చిదిద్దాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తులు మాస్క్ లు ధరించి భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలకు తీసుకోవాలని, ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News