Saturday, April 20, 2024

కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తలసాని..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి తలసాని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న మంత్రి తలసానికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Talasani Srinivas visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News