- Advertisement -
హైదరాబాద్: గతంలో మంత్రి కెటిఆర్ నాయకత్వంలో గ్రేటర్ లో 99 స్థానాలు కైవసం చేసుకున్నామని, ఈ సారి 104 స్థానాల్లో విజయం సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ… హైదరాబాద్ జంట నగరాల ప్రజలు టిఆర్ఎస్ వైపు ఉన్నారని చెప్పారు. కరోనా, వరదల సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వమే ఆదుకున్నదని గుర్తుచేశారు. సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు హైదరాబాద్ కు ఏం చేసిన్రో చెప్పకుండా ఏకవచనంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం హైదరాబాద్ కు ఏం చేసిందో బిజెపి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Talasani Srinivas Yadav Comments On BJP
- Advertisement -