Friday, March 29, 2024

తాలిబన్ల బహిరంగ ఉరి శిక్షలు

- Advertisement -
- Advertisement -

Taliban hang dead body from crane

తాలిబన్ల పాలనలో మరో ఘట్టం

కాబూల్ :అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు నలుగురి శవాలను ఓ క్రేన్ ద్వారా ఉరితీశారు. దేశపు పశ్చిమ నగరం హెరాత్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. కిడ్నాప్‌లకు పాల్పడుతున్న నలుగురిని హెరాత్‌లో కాల్పుల సందర్భంగా కాల్చిచంపారు. తరువాత వారిని ఓ క్రేన్‌పై అమర్చిన ఉరి కొయ్యపై ఉంచి ఉరితీశారు. కిడ్నాప్‌లు ఇతర నేరాలకు పాల్పడ్డ వారికి ఇదే శిక్ష అని ఈ సందర్భంగా తెలిపారు. వీరి శవాలను పలు ప్రాంతాలలో ప్రదర్శిస్తారని, ఇక ముందు ఎవరూ నేరాలకు పాల్పడకుండా ఈ విధంగా చేస్తారని హెరాత్ ప్రాంత ఉన్నతాధికారి డిప్యూటి గవర్నర్ మవ్లావి షీర్ అహ్మద్ ముహజిర్ ప్రకటించారు. శవాలను ఉంచే వాహనంలో వీరిని ఉంచి శవాలను తలకిందులుగా చేసి ఊరేగించిన దృశ్యాలతో కూడిన వీడియోలు ఇప్పుడు నెట్‌లో వెలుగు చూశాయి. శవాల ఛాతీపై కిడ్నాపర్లకు ఇదే గతి పడుతుంది అనే రాతలు ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News