Friday, March 29, 2024

ఇకపై అలా ఉండదు

- Advertisement -
- Advertisement -

Tamannah act in Sitimaar movie

కరోనా సెకండ్ వేవ్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. సినిమా ఇండస్ట్రీలో కూడా పరిస్థితి బాగాలేదు. ఇకపై షూటింగ్‌ల తీరు కూడా మారుతుందని అంటోంది మిల్క్ బ్యూటీ తమన్నా. “గతంలో షూటింగ్ లొకేషన్‌కి వెళ్తే అందరినీ విష్ చేసేదాన్ని. ఆత్మీయంగా హగ్ చేసుకునేవాళ్ళం. ఇకపై అలా ఉండదు. కెమెరా ముందు నటించేటప్పుడు మినహా మిగతా టైమ్‌లో మాస్క్ ధరించాల్సిందే. ఇదే చాలా కాలం కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గేవరకు మునుపటిలా షూటింగ్ చేయలేం. ఎక్కువగా సెట్స్‌లోనే షూటింగ్ చేయాలి”అని తమన్నా పేర్కొంది. గత ఏడాది ఆమెకి కరోనా సోకింది. దాని నుంచి కోలుకుంది. ఆ తర్వాత రెండు వెబ్ సిరీస్ షూటింగులు పూర్తి చేసింది. మళ్ళీ షూటింగ్‌లు మొదలైన తర్వాత ‘గుర్తుందా శీతాకాలం’, ‘సీటిమార్’, ‘మేస్ట్రో’ చిత్రాల షూటింగ్‌లలో ఆమె పాల్గొంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News