- Advertisement -
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమందించేందుకు గాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీతో రానున్నారని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ ప్రకటించారు. దీనికి గాను ఆర్థిక వ్యవస్థకు చెందిన వివిధ రంగాల నుంచి సూచనలు, అభ్యర్థనలను కేంద్రం కోరింది.
ఏ ప్రభుత్వ బ్యాంక్ సర్వీస్ చార్జీలను పెంచదు
ఏ ప్రభుత్వరంగ బ్యాంక్ సర్వీస్ చార్జీలను పెంచబోదని మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. -నవంబర్ 1 నుంచి క్యాష్ డిపాజిట్, విత్డ్రాలకు చార్జీలను అమలు చేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పష్టతనిస్తూ, ఏ ప్రభుత్వరంగ బ్యాంక్ సేవలకు చార్జీలను విధించబోదని తెలిపింది.
- Advertisement -