Thursday, March 28, 2024

తరుణ్‌గొగోయ్ మొదటి వర్ధంతి.. కాంగ్రెస్ శ్రేణుల ఘననివాళి

- Advertisement -
- Advertisement -

Tarun Gogoi's first death anniversary

 

గువాహతి: అసోం మాజీ సిఎం తరుణ్‌గొగోయ్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘననివాళి అర్పించారు. గువాహతిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వర్ధంతి సభలో గొగోయ్ కుమారుడు, కాంగ్రెస్ ఎంపి గౌరవ్‌గొగోయ్ పాల్గొన్నారు. తన తండ్రికి సామాన్య ప్రజానీకంతో ఎంతో అనుబంధం ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ఆదర్శాల పట్ల ఆయనకు నిబద్ధత ఉండేదన్నారు. తరుణ్‌గొగోయ్ 2001 నుంచి 2016 వరకు అసోంకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన ఆయన రెండుసార్లు కేంద్రమంత్రిగా పని చేశారు. మరణానంతరం ఇటీవలే తరుణ్‌కు పద్మభూషణ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గువహతిలో జరిగిన వర్ధంతిసభలో ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు భూపేన్‌కుమార్‌బోరా, మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు రిపున్‌బోరా, అసెంబ్లీలో కాంగ్రెస్ నేత దేబబ్రతసైకియా, మాజీమంత్రి రకీబుల్‌హుస్సేన్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News