Saturday, April 20, 2024

లండన్‌లో ఘనంగా “టాక్ బోనాల జాతర” వేడుకలు

- Advertisement -
- Advertisement -

TAUK celebrated Bonalu in grand manner at London

ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు
 “దేశ్ కా నేత కెసిఆర్” అంటూ నినదించిన ఎన్నారైలు

లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 1000 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టాక్ ఉపాద్యక్షురాలు శుషుమన రెడ్డి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన కార్యక్రమం అనంతరం అధికార ప్రతినిది హరిగౌడ్ వాఖ్యాతగా కొనసాగింది. స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు ప్రవాస బిడ్డలనే కాకుండా స్తానికులని కూడా ముగ్దులని చేసింది,.లండన్ కి ఉన్నత చదువులకోసం వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం, వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషదారని ధరించి, మన తెలంగాణ సంస్కృతి కోసం బోనాలు ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చాడు.

సందీప్ కుమార్ బుక్క, మిత్ర బృందం పర్యవేక్షణలోనే జరిగిన పోతురాజు విన్యాసాన్నీ ప్రవాసులే కాక హాజరైన ముఖ్య అతిధులు సైతం ప్రసంశించి సత్కరించారు. భారత సంతతికి చెందిన స్థానికి ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ… యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్నా తీరు చాలా గొప్పగా ఉందని, లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న నన్ను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.

టాక్ వ్యవస్థాపక అద్యక్షులు అనిల్ కూర్మాచలం గారి గురించి మాట్లాడుతూ… లండన్ లో తెలంగాణ రాష్త్ర సాధన కోసం ఎంతో శ్రమించిన నాయకుడని, తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత గురించి ప్రపంచ వేదికల్లో వినూత్నంగా పరిచయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ప్రవాసులకు వారిదా ఉంటూ ఎంతో కష్ట పడి పని చేశారని. ఈ సందర్బంగా అనిల్ గారి కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం టిఎస్ఎఫ్ డిసి చైర్మన్ గా సమున్నత స్థానం కల్పించినందుకు గాను సీఎం కేసీఆర్ కి కృతఙతలు తెలియజేసారు. ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర పండుగ “బోనాల” వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు లో పాల్గొనడం చాలా సంతోషం గా ఉందని తెలిపారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా అనిపించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు.

బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేక సత్కరించి, బహుమతులందజేశారు. ఎంపీ రూత్ క్యాడ్బరి మాట్లాడుతూ…. ఇంత గొప్ప సాంస్కృతిక వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసికొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని, ముఖ్యంగా మహిళలంతా ముందుండి ఈ వేడుకల్ని నిర్వహించడం సాటి మహిళగా గర్వంగా ఉందని తెలిపారు. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని తెలిపారు. టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ ,తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచం లో ఉన్నతెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమపథకాల గురించి, బంగారు తెలంగాణ లో ఎన్నారైల పాత్ర గురించి అందరికి గుర్తు చేశారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి, బాద్యత గల తెలంగాణా బిడ్డలు గా ఆనాడు ఉద్యమం లో నేడు పునర్నిర్మాణం లో పోశిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శనంగా ఉందని తెలిపారు. టాక్ సంస్థ బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ సంస్థని అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఎమ్ఎల్ సి కవితకి కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్ వ్యవస్థాపక అద్యక్షులు అనిల్ కూర్మంచాలకు దక్కిన గౌరవం ప్రతి ప్రవాస బిడ్డకి దక్కిన గౌరం అని అనిల్ అన్న లేని లోటు వున్నా తన స్పూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నాం అని తెలిపారు. సంస్థ ఉపాద్యక్షురాలు శుషుమన రెడ్డి మాట్లాడుతూ…. టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరు బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపుచేయడం ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు. ఎన్నారై టి. ఆర్. యస్ అధ్యక్షులు అశోక్ దూసరి గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని, , ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు – బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్బంగా అనిల్ కూర్మచలం గారు గత దశబ్ద కాలం తెలంగాణ సంస్కృతిని ఎంత ముందుకు తీసుకువెళ్లారో గుర్తు చేసుకున్నారు. లండన్ లో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియ చేసి వారిని సత్కరించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలు కోరుకుంటున్నారని, నేడు తెలంగాణలో జరిగే అభివృద్ధి దేశమంతా అమలు కావాలంటే కేవలం కెసిఆర్ వంటి నాయకుడి వల్లే అవుతుందని, “దేశ్ కా నేత కెసిఆర్ ” అంటూ ఎన్నారైలంతా నినదించారు. “ఫ్యూచర్ కాండిడేట్ ప్రోగ్రాం ఫర్ యూకే” ఉదయ్ నాగరాజు మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ కూర్మాచలం గారితో జరుపుకున్న బోనాల పండుగను గుర్తు చేసుకున్నారు. ప్రతి ప్రవాస బిడ్డ శర్మాజీ స్పూర్తితో ప్రత్యక్ష రాజకీయాలలో క్రియా శీలకంగా పనిచేసి మన సమాజ ఐకమత్యాన్ని చాటి చెప్పాలని కోరారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ తెలంగాణ వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి మరియు హౌన్సలౌ డిప్యూటీ మేయర్ ఆదేశ్ ఫర్మాన్ లను సత్కరించి జ్ఞాపికను అందచేశారు. తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ సబ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో ప్రశంశించారు.

టాక్ సభ్యులు సత్య చిలుముల, రాకేష్ పటేల్, సత్యపాల్ పింగిళి, పృధ్వీ, శ్రీకాంత్, క్రాంతి, సుప్రజ పులుసు ఆద్వర్యం లో జరిగిన బోనాల జాతర ఇంతటివిజయం సాదించడం సంతోషంగా ఉందని కమిటీ సబ్యులు తెలిపారు. ఇతర ఎన్నారై సంఘాల యూకే ప్రతినిధులు వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో అద్యక్షులు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమన రెడ్డి, సత్య చిలుముల, , అడ్వైసరీ చైర్మన్ మట్టా రెడ్డి సభ్యులు, పవిత్ర రెడ్డి కంది, నవీన్ రెడ్డి, స్వాతి బుడగం , రాకేష్ పటేల్ ,సత్య పింగిళి, సత్యం కంది, హరి నవపేట్ , సుప్రజ, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి , శ్రీ శ్రావ్య, శ్వేతా మహేందర్ , శ్రీలక్ష్మి, రవికిరణ్, గణేష్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, పృధ్వి, శ్రీకాంత్, భూషణ్, అవినాష్, శశి, జస్వంత్, మణి తేజ, నికిల్, మధు, మనోజ్, అక్షయ్, సందీప్, లడ్డు, స్రవంతి, జాహ్నవి, వెంకట్రెడ్డి, వంశీ, రవి పులుసు,మాధవ్, క్రాంతి, వేణు, శ్రీవిద్య, అక్షిత, శ్రీవిద్య, , గణేష్ రంజిత్, రవి రతినేని, వంశీ పొన్నం , రాజేష్ వర్మ, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News