అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో టిడిఎల్పీ సమావేశం అమరావతిలో ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి ఎంఎల్ఎలు, ఎమ్ఎల్ సిలు హాజరయ్యారు. ఈ సమావేశలో ఎపి శాసనమండలి రద్దు, సభలో సభ్యులు వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. టిడిఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్ఎల్ సిలు హాజరుకావట్లేదని ముందుగానే పార్టీ అధిష్టానానికి సమాచారం ఇచ్చారు. వ్యక్తిగత కారణల రీత్యా హాజరుకాలేకపోతున్నట్టు గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల, రామకృష్ణలు తెలియజేశారు. టిడిపి ఎమ్ఎల్ సిలను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని టిడిపి తీవ్రంగా ఆరోపిస్తోంది. మండలిలో టిడిపి తరుపున 32 మంది ఎమ్ఎల్ సిలు సమావేశానికి 23మంది హాజరయ్యారు.
tdlp meeting begins in amravati andhra pradesh
- Advertisement -