Saturday, April 20, 2024

రైలు కిందపడి ఉపాధ్యాయుడు ఆత్మహత్య…. భార్య ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -


మెదక్: భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని భార్య రెండో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం శ్రీరాంనగర్ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రామారావు (40) అనే వ్యక్తి శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల కొత్త కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కుటుంబ కలహాలనేపథ్యంలో సికింద్రాబాద్‌లో ని రైతు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే నర్సాపూర్ పట్టణంలో శ్రీరాంనగర్ లో కాలనీలో ఉంటున్న భార్య రెండో ఫ్లోర్ నుంచి దూకింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాలు విరిగిపోయిందని, తలకు చిన్నపాటి గాయాలైనట్టు గుర్తించారు. ఈ దంపతులు దివ్యాన్షు(6), పూజిత(1) అనే పిల్లలు ఉన్నారు. దీంతో రామారావు ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News