Wednesday, April 24, 2024

గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన వికారాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నారాయణ పేట జిల్లా ఓట్కూర్ గ్రామానికి చెందిన ఖలీల్ హైమద్ అనే ఉపాధ్యాయుడు శివారెడ్డి పేట సమీపంలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ప్రతి రోజు రాత్రి సమయంలో ఒకరు విధులు నిర్వహిస్తారు. హైమద్ శుక్రవారం రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసిన అనంతరం బాత్రూమ్‌కు వెళ్లాడు. బాత్రూమ్ నుంచి ఎంతకు బయటకు రాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది డోర్ పగలగొట్టి చూడగా బాత్రూమ్ లో పడిపోయి ఉన్నాడు. 108లో వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. హార్ట్‌ఎటాక్‌తో అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News