Friday, April 19, 2024

ప్రభుత్వ స్కూళ్లో టీచర్ పై భర్త కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

Teacher husband attack on her in West Godawari

పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరు గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో టీచర్ పై ఆమె భర్త దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామ దుర్గా ప్రసాద్, నాగ లక్ష్మి అనే దంపతులకు మూడేళ్ల కూతురు ఉంది. గత కొద్ది రోజుల నుంచి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నాగ లక్ష్మిని కట్నం తేవాలని వేధిస్తుండడంతో ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉన్న నాగలక్ష్మి కాకిలేరులోని సింగోడియన్ పేటలో పాఠశాలకు బదిలీ అయింది. దుర్గా ప్రసాద్ సమాచారం తెలుసుకొని ఆ స్కూల్ కు వెళ్లి ఆమె ఆరా తీశాడు.  నాగలక్ష్మి క్లాస్ రూమ్ లో ఉందని ప్రధానోపాధ్యాయుడు వెంకటాచార్యులు అతడికి చెప్పడంతో తరగతి గది వెళ్లాడు. క్లాస్ రూమ్ లోకి వెళ్లి జుట్టు పట్టుకొని నేల్ కట్టర్, చాకుతో పలుమార్లు పొడిచాడు. విధ్యార్థులు గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జానా సతీష్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News