Tuesday, April 16, 2024

భూ తగాదాలో ఉపాధ్యాయుడు మృతి..

- Advertisement -
- Advertisement -

Five died after consuming adulterated alcohol in UP

జోగులాంబ గద్వాల జిల్లాలో భూ తగాదాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. అలంపూర్‌లో ఉపాధ్యాయుడు స్వాములు, మరో వ్యక్తికి మధ్య భూమి విషయంలో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి పెద్ద గొడువగా మారి.. చివరికి ఒకరిపై ఒకరు చేయి చేసుకునేదాకా వెళ్లింది. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో పట్టుతప్పిన స్వాములు కిందపడిపోయారు. అయితే, స్వాముల తలకు బలంగా దెబ్బతగలడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Teacher killed with land dispute in Gadwal 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News