Thursday, April 25, 2024

ప్రపంచకప్‌లు గెలిచే సత్తా ఉంది: రోహిత్ శర్మ

- Advertisement -
- Advertisement -

Team India aims to win T20 world cup: Rohit

ముంబై: రానున్న మూడేళ్లలో టీమిండియా రెండు ప్రపంచకప్ ట్రోఫీలు సాధించడం ఖాయమని జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జోస్యం చెప్పాడు. కిందటి ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్లోనే ఓటమి పాలైనా రానున్న వరల్డ్‌కప్‌లో ట్రోఫీని గెలుచుకోవడం తథ్యమన్నాడు. అంతేగాక రానున్న రెండు ట్వంటీ20 ప్రపంచకప్‌లలో కూడా భారత్ ట్రోఫీలను సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉందన్నాడు. ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా టీమిండియాకు ఉందని వివరించాడు. వచ్చే మూడేళ్ల కాలం తమకు పరీక్షలాంటిదేనన్నాడు. ఇందులో మెరుగైన ఆటతో కనీసం రెండు ప్రపంచకప్ ట్రోఫీలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపాడు. సమష్టిగా రాణిస్తే దీన్ని సాధించడం తమకు అసాధ్యమేమి కాదన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదన్నాడు. కోహ్లి, పంత్, బుమ్రా, హార్దిక్, ధావన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారని, వీరిలో ఏ ఇద్దరూ రాణించినా టీమిండియాకు విజయం నల్లేరుపై నడకేనని అభిప్రాయపడ్డాడు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో రోహిత్ ఈ విషయం చెప్పాడు.

Team India aims to win T20 world cup: Rohit

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News