మౌంట్ మౌంగనూయి: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 46 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 261 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెెఎల్ రాహుల్ సెంచరీతో కదంతొక్కాడు. శ్రేయస్ అయ్యర్ 62 పరుగులు చేసి నీశమ్ బౌలింగ్ లో గ్రాండ్ హోమ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెఎల్ రాహుల్ (91) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి వికెట్ రూపంలో మయాంక్ అగర్వాల్ ఒక పరుగు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తొమ్మిది పరుగులు చేసి బెనెట్ బౌలింగ్ లో జమ్సీన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పృద్వీషా 40 పరుగులు చేసి రనౌట్ రూపంలో మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రాహుల్ (104), పాండే (41) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మూడో వికెట్ పై శ్రేయస్ అయ్యర్, రాహుల్ వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో వికెట్ పై రాహుల్, పాండే 95 బంతుల్లో 107 పరుగుల భాగస్వామ్యంతో ఆటను కొనసాగిస్తున్నారు.
Team India loss 4 Wickets for 242 run in Ind vs NZ