Thursday, March 28, 2024

టీమిండియా 119/6

- Advertisement -
- Advertisement -

Team India loss six wickets for 119 runs

కాన్పూర్: గ్రీన్ పార్క్‌లో భారత్ -న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్ నాలుగో రోజు భారత జట్టు 46 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 119 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆరు వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. రవీచంద్రన్ అశ్విన్(32), శ్రేయస్ అయ్యర్(34) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. భారత్ బ్యాట్స్‌మెన్లలో ఛటేశ్వరా పూజారా(22), మయాంక్ అగర్వాల్ (17), శుభ్‌మన్ గిల్ (01), అజింక్య రహానే (04), రవీంద్ర జడేజా(0) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్ (34), వృద్ధిమాన్ సాహా(07) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా 168 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ మూడు వికెట్లు పడగొట్టగా సౌతీ రెండు వికెట్లు, అజాజ్ పటేల్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News