Friday, March 29, 2024

శ్రీలంక టూర్‌కు బ‌య‌లుదేరిన ధావన్ సేన..

- Advertisement -
- Advertisement -

Team India off to Sri Lanka for ODI and T20 Squad

ముంబై: శిఖ‌ర్ ధావ‌న్ నేతృత్వంలోని 20మంది సభ్యులతో కూడిన భారత యువ జట్టు సోమ‌వారం శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లింది. రెండు వారాలుగా ముంబైలోని ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న ఆటగాళ్లు ఈ రోజు బిసిసిఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శ్రీలంకకు వెళ్లారు. ఈ సందర్భంగా విమానంలో దిగిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా, శ్రీలంక జట్టుతో 3 వ‌న్డేలు, 3 టీ20ల్లో త‌ల‌ప‌డ‌నుంది. జులై 13నుంచి జరగనున్న వన్డే సిరీస్ తో ధావన్ సేన ఈ పర్యటనను ప్రారంభించనుంది. ఈ ఏడాది చివ‌ర్లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనలో రాణించి సత్తా చాటాలని యువ ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. మరోవైపు తొలిసారి కెప్టెన్ గా వ్యవహరించనున్న ధావన్ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. కాగా, శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టుకు రాహుల్ ద్ర‌విడ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

భారత జట్టు: పృథ్వీ షా, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌, శిఖ‌ర్ ధావ‌న్‌(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్‌, సూర్య‌కుమార్ యాద‌వ్, మ‌నీష్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రాణా, ఇషాన్ కిష‌న్‌, సంజు శాంస‌న్‌, కృనాల్ పాండ్యా, భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌, న‌వ్‌దీప్ సైనీ, యజువేంద్ర చాహ‌ల్‌, రాహుల్ చ‌హర్‌, కే గౌతమ్‌, కుల్‌దీప్ యాద‌వ్, దీప‌క్ చ‌హ‌ర్‌, చేత‌న్ స‌కారియా, వ‌రున్ చ‌క్ర‌వ‌ర్తి.

Team India off to Sri Lanka for ODI and T20 Squad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News