Saturday, April 20, 2024

టీమిండియా ప్రాక్టీస్ షురూ..

- Advertisement -
- Advertisement -

Team India practice begins for 4th Test against ENG

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో, చివరి టెస్టు కోసం టీమిండియా క్రికెటర్లు సోమవారం సాధన ఆరంభించారు. ఇప్పటికే మూడో టెస్టులో గెలిచిన భారత్ సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక మూడో టెస్టు జరిగిన మొతెరాలోనే ఆఖరి మ్యాచ్ జరుగనుంది. మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం, పిచ్ బ్యాటింగ్‌కు క్లిష్టంగా మారడంతో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలాంటి స్థితిలో చివరి మ్యాచ్ కోసం బ్యాట్స్‌మెన్‌లు నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలనే పట్టుదలతో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టారు. కెప్టెన్ కోహ్లితో సహా కీలక బ్యాట్స్‌మెన్‌లందరూ సోమవారం కఠోర సాధన చేశారు. మరోవైపు బౌలర్లు కూడా ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.

Team India practice begins for 4th Test against ENG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News