Friday, March 29, 2024

పుజారా ఔట్… భారత్ 188/2

- Advertisement -
- Advertisement -

 

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 63 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 188 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 292 పరుగుల ఆధిక్యంలో ఉంది. శభ్‌మన్ గిల్ శతకంతో చెలరేగాడు. ఛటేశ్వరా పుజారా 42 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. రోహిత్ శర్మ 35 పరుగులు చేసి కుహ్నెమాన్ బౌలింగ్‌లో లబుషింగేకు క్యాచ్ ఇచ్చి మొదటి వికెట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(103), విరాట్ కోహ్లి(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News