Thursday, April 18, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా..

- Advertisement -
- Advertisement -

Team India won the toss and elected to bat

 

హైదరాబాద్ : భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌కు సర్వసిద్ధమైంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే గత రెండు రోజులుగా ముంబయిలో కురుస్తున్న వర్షాల కారణంగా మ్యాచ్‌పై నీలి మేఘాలు అలుముకున్నాయి. వర్షాల కారణంగా వాంఖడే పిచ్‌ ఔట్‌ఫీల్డ్‌ తడిగా మారింది. దీంతో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు టాస్‌ ప్రక్రియను ఆలస్యం చేశారు. మరి కాసేపట్లో మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే ఇండియా, న్యూజిలాండ్‌ల మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దీంతో రెండో టెస్ట్‌పై ఇరు జట్లు ఆశలు పెట్టుకున్నాయి. ఈ మ్యాచ్‌ను ఎలాగైనా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News