- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం జిహెచ్ఎంసి సహా నగరపాలికలు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇక శాసనసమండలిలో విద్యుత్ అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలిలోనూ తీర్మానం చేయనున్నారు. అయితే కరోనా నేపథ్యంలో నేటితో సమావేశాలు ముగిసే అవకాశాలున్నాయి.
- Advertisement -