Thursday, March 28, 2024

తెలంగాణలో 1593 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

Telangana corona cases list

 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 1593 కేసులు నమోదుకాగా ఎనిమిది మంది మృతి చెందినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 54 వేలకు చేరుకోగా 463 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ నుంచి 40334 మంది కోలుకోగా 44677 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్కరోజే 54 వేల మంది టెస్టులు చేయగా 1593 మంది పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. జిహెచ్‌ఎంసి పరిధిలో 641 కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. రంగారెడ్డి (171), వరంగల్ అర్బన్ (131), మేడ్చల్ మల్కాజ్‌గిరి(91), కరీంనగర్ (51) పాజిటివ్ కేసులు వచ్చినట్టు సమాచారం. భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 13.89 లక్షలకు చేరుకోగా 32127 మంది చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News