- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 609 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య2.71 లక్షలకు చేరుకోగా 1465 మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 2.61 లక్షల మంది కోలుకోగా 9 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 56.05 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు.
- Advertisement -