- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒకరు మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 2.7 లక్షలకు చేరుకోగా 1462 మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 2.6 లక్షల మంది కోలుకోగా తొమ్మిది వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 55.51 లక్షల మందికి కరోనా టెస్టులు చేసింది.
- Advertisement -