- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వైరస్ ధాటికి హైదరాబాద్ మహానగరం గడగడ వణికిపోతుంది. గత 24 గంటల్లో 2296 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది చనిపోయారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1.77 లక్షలకు చేరుకోగా 1062 మంది చనిపోయారు. కరోనా నుంచి 1.46 లక్షల మంది కోలుకోగా దాదాపుగా 30 వేల మంది చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ కేసుల వివరాలు.. హైదరాబాద్ జిహెచ్ఎంసి (321), రంగారెడ్డి(271), మేడ్చల్ మల్కాజ్ గిరి(173), నల్లగొండ(155), కరీంనగర్ (136), వరంగల్ అర్బన్ జిల్లా(99), సిద్దిపేట(92), నిజామాబాద్(82), సంగారెడ్డి(81) గా ఉన్నాయి.
- Advertisement -