- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పల్లె, పట్టణం అని తేడా లేకుండా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 2173 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 8 మంది మృత్యువాతపడ్డారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1.79 లక్షలకు చేరుకోగా 1070 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 1.48 లక్షల మంది కోలుకోగా 30 వేల మంది చికిత్స పొందుతున్నారు. బుధవారం ఒక్క రోజే 55 వేల కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 26.84 లక్షలకు చేరుకుంది. అత్యధిక పాజిటివ్ కేసులు జిహెచ్ఎంసి(308)లో నమోదుకాగా వరసగా రంగారెడ్డి(168), మేడ్చల్ మల్కాజ్గిరి(151), నల్లగొండ(136), కరీంనగర్(120), సిద్దిపేట(95), భద్రాద్రి కొత్తగూడెం(88), ఖమ్మం(86), సూర్యాపేట(82) పాజిటిక్ కేసులు నమోదయ్యాయి.
- Advertisement -