- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1531 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2.37 లక్షలకు చేరుకోగా 1330 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2.17 లక్షల చేరుకోగా 18456 మంది చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఒక్క రోజు 43,790 మందికి టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 42.40లక్షలుగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -