Friday, April 19, 2024

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: ఉప రాష్ట్రపతి, ప్రధాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ : తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణకు నిలయంగా ఉన్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సహజ వనరులతో పాటు నైపుణ్యం కల్గిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను పోషిస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు ఉప రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. అనేక రంగాల్లో రాణించిడమే కాకుండా ప్రత్యేకమైన సంస్కృతితో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నామని మోడీ ట్వీట్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News