Friday, April 19, 2024

వీధి వ్యాపారులకు రుణ సాయంలో మనమే నెం.1

- Advertisement -
- Advertisement -

వీధి వ్యాపారులకు రుణ సాయంలో మనమే నెం.1

మూడేళ్లలో రూ.695 కోట్ల రుణాన్ని అందించిన రాష్ట్రం
కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మున్సిపల్ అధికారులు

వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానం సాధించింది. పెద్ద రాష్ట్రాల కేటగిరిలో అగ్రభాగాన నిలిచింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభిశవృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా పురపాలక శాఖ అధికారులు గురువారం ఈ అవార్డు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభు త్వం తరుఫున మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, మెప్మా ప్రాజెక్టు మేనేజర్ చైతన్య ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులను కేంద్ర మంత్రి అభినందించారు. దేశంలో పెద్ద రాష్ట్రాల కేటగిరిలో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్ర దేశ్ రాష్ట్రాలకు అవార్డులను కేంద్రమంత్రి అం దించారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చే పిఎంస్వాన్ నిధి ప్రారంభించి మూడు సంవత్సరాలయిన సందర్భంగా గురువారం ఢిల్లీలో ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఇక డిజిటల్ లావాదేవీలు దేశంలో ఎక్కువ చేసిన రా ష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్ పథ్రమ స్థానంలో నిలిచింది.

పట్టణ ప్రగతిలో భాగంగా వీధి వ్యాపారుల అభివృద్ధిలో భాగంగా వారికి మౌలిక సదుపాయాల కల్పించాలని 2020 ఫిబ్రవరి 16వ తేదీన ము ఖ్యమంత్రి కెసిఆర్, ఎంఎల్‌ఎలు, జిల్లా కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లతో జరిగిన సమావేశంలో ఆదేశించారు. ప ట్టణ ప్రగతిలో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలివ్వాలని వీధి వ్యాపారులకు స్ట్రీట్ వెం డింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని అదే సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన మహబూబ్ నగర్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో సిఎం సూచించారు. దీంతోపాటు వీధి వ్యాపారాలు చేసుకోవడానికి వర్కింగ్ క్యాపిటల్ అందించాలని పురపాలక శాఖ అధికారులకు కెటిఆర్ సూచించారు. సిఎం, మంత్రి కెటిఆర్ ఆదేశాల నేపథ్యంలోనే వీధి వ్యాపారులకు ఇచ్చే రుణాలపై స్టాంప్ డ్యూటీని మినహాయించిన మొదటి రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ నిలిచింది. వీధి వ్యాపారులు కరోనాతో తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మొదటి విడతలో 3.40 లక్షల మందికి
వీధి వ్యాపారులకు మొదటి విడతలో ఒక్కోక్కరికీ రూ.10వేల చొప్పున రుణం అందించారు. మొదటి విడతలో 3.40 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. రాష్ట్రంలో 3,58,776 (106శాతం) వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు కాగా 3,56,678 మందికి రూ.353.17 (105శాతం) కోట్లను పంపిణీ చేశారు. మొదటి విడత రుణాల పంపిణీలో 100 శాతం లక్ష్యాన్ని చేరి తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

టాప్‌లో తెలంగాణ పట్టణాలు
లక్ష జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో దేశ వ్యాప్తంగా 3,555 పట్టణాలు ఉండగా ఈ కేటగిరికి సంబంధించి టాప్ 10లో పది పట్టణాలు తెలంగాణకు చెందినవే ఉన్నాయి. మొదటి స్థానంలో సిద్దిపేట, రెండో స్థానంలో సిరిసిల్ల పట్టణం, నిర్మల్, కామారెడ్డి, బోధన్, జహీరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, పాల్వంచ, ఆర్మూర్ పట్టణాలు టాప్ 10లో నిలిచాయి. లక్ష నుంచి 10 లక్షల జనాభా కేటగిరిలో దేశంలో 442 పట్టణాలు ఉండగా వరంగల్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, నిజామాబాద్ 10వ స్థానంలో ఉంది. 40లక్షల పైగా ఉన్న జనాభా కేటగిరిలో జీహెచ్‌ఎంసీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. రెండో విడత రుణాల పంపిణీలో భాగంగా మొదటి విడత రుణాన్ని తిరిగి చెల్లించిన ఒక్కో వీధి వ్యాపారికి రూ.20వేలను ప్రభుత్వం అందించింది. 1,45,100 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా 1,53,306 మందికి (106శాతం) మంజూ రు చేశారు. ఇందులో 1,46,692 (101 శాతం) రుణాలను పంపిణీ చేశారు.

లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాల్లో సిరిసిల్ల నెంబర్‌వన్
లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో టాప్ 10 పట్టణాల్లో 10 తెలంగాణకు చెందినవే ఉన్నాయి. మొద టి స్థానంలో మొదటి స్థానంలో సిరిసిల్ల పట్టణం, రెండో స్థానంలో కామారెడ్డి, నిర్మల్, బోధన్, సిద్దిపేట, మంచిర్యాల, కోరుట్ల, ఆర్మూర్, సంగారెడ్డి, జహీరాబాద్ పట్టణంలో టాప్ 10లో నిలిచాయి. లక్ష నుంచి 10లక్షల జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో వరంగల్ మొదటి స్థానంలో నిలవగా, నిజామాబాద్ రెండో స్థానంలో, కరీంనగర్ మూడోస్థానంలో, రామగుండం 10వ స్థానంలో ఉన్నాయి. 40 లక్షల జనాభా దాటిన కేటగిరిలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది.

వీధి వ్యాపారులకు మూడు విడతల్లో రూ.695.42 కోట్ల పంపిణీ
వీధి వ్యాపారులకు మూడు విడతల్లో ఇప్పటివరకు రూ.695.42కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. రెగ్యులర్ రుణాలు చెల్లించిన వారికి తిరిగి రుణాన్ని బ్యాం కులు వారి అకౌంట్‌లలో జమ చేశాయి. ఇలా తెలంగాణలోని వీధి వ్యాపారులకు రూ.10.70 కోట్లు జమయ్యా యి. మూడో విడత రుణాల్లో భాగంగా 20వేల రుణాన్ని తీసుకొని చెల్లించిన వారికి రూ.50వేలను మూడోవిడతలో అందించారు. 3,870 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా 10,661 మందికి (275 శాతం) మందికి రుణాలను మంజూరు చేశారు. 10, 058 (260 శాతం) మందికి రూ.49.64కోట్లను పంపి ణీ చేశారు.

40లక్షల జనాభా దాటిన కేటగిరిలో గ్రేటర్ హైదరాబాద్ మొదటి స్థానంలో
మూడో విడతలో లక్ష పైచిలుకు జనాభా కేటగిరిలో తెలంగాణలోని 9 పట్టణాలు దేశంలోనే టాప్ 10లో నిలిచాయి. ఇందులో నిర్మల్ మొదటి స్థానంలో, గద్వాల రెండో స్థానంలో, సంగారెడ్డి, సిరిసిల్ల, పాల్వంచ, సిద్దిపేట, కొత్తగూడెం, బోధన్, వనపర్తిల నిలిచాయి. లక్ష నుంచి 10లక్షల జనాభా కేటగిరిలో వరంగల్ మొదటి స్థానంలో, రామగుండం మూడో స్థానం, కరీంనగర్ నాలుగో స్థానం, నిజామాబాద్ 10వ స్థానంలో నిలిచా యి. 40లక్షల జనాభా దాటిన కేటగిరిలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. 3.24లక్షల వీధి వ్యాపారులు డిజిటల్ రూపంలో వినియోగదారుల నుంచి డబ్బులను స్వీకరిస్తున్నారు. వీరికి క్యూఆర్ కోర్, యూపీఐ ఐడీని కలిగి ఉన్నారు. డిజిటల్ లావాదేవీలను నిర్వహించడానికి వీధి వ్యాపారులకు శిక్షణ ఇచ్చారు.

వీధి వ్యాపారుల కోసం స్ట్రీట్ వెండింగ్ జోన్‌లు
డిజిటల్ లావాదేవీలు దేశంలో ఎక్కువ చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోనే అతి పెద్ద జనాభా ఉన్న రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ ముందు నిలిచింది. తెలంగాణ వీధి వ్యాపారులు డిజిటల్ లావాదేవీలు చేసినందుకు ప్రోత్సాహకంగా రూ.6.59 కోట్ల మొత్తం వీధి వ్యాపారులు పొందగా, ఉత్తర ప్రదేశ్ వీధి వ్యాపారులు రూ.6.67 కోట్ల మొత్తాన్ని పొందారు. తెలంగాణ ప్రభుత్వం వీధి వ్యాపారులకు పట్టణ ప్రగతిలో రుణాలు అందించడమే కాకుండా వారు వ్యాపారాలు చేసుకోవడానికి అనువుగా స్ట్రీట్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 2,676 స్ట్రీట్ వెండింగ్ షెడ్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు ఇందులో 1,294 పూర్తి చేసింది. మిగిలిన 1382 షెడ్స్ నిర్మాణ దశలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News