Thursday, April 25, 2024

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం: బానోతు శంకర్ నాయక్

- Advertisement -
- Advertisement -

Telangana govt buy every grain

మహబూబాబాద్: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులకు ఎంఎల్ఎ బానోతు శంకర్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో వారు చేస్తున్న సేవలను కొనియాడారు. రైతులు అధైర్య పడొద్దని, ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. నెల్లికుదురు మండలం రామగిరి ఐకెపి సెంటర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శంకర్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు పక్షపాతి అని, టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని మెచ్చుకున్నారు. కరోనా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలని, భౌతిక దూరంతో పాటు మాస్కులు ధరించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News