Thursday, April 25, 2024

ఆ రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువ ప్రభుత్వోద్యోగాలు: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Telangana govt more recruitment

 

హైదరాబాద్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారంలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఇటీవల నెలకొల్పిన కంపెనీలతో 15 లక్షల మందికి ఉపాధి దొరికిందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో కంటే తెలంగాణలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణలో అన్ని ప్రాంతాలకు కృష్ణా, గోదావరి నీళ్లు పారుతున్నాయన్నారు. ఈ సందర్భంగా సురభి వాణీదేవి గ్రాడ్యుమేట్లతో మమేకమయ్యారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ తనకే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News