Friday, March 29, 2024

ఫస్ట్​ రౌండ్​లో ఆధిక్యంలో సురభి వాణీదేవి

- Advertisement -
- Advertisement -

Telangana Graduate MLC Election Results 2021

హైదరాబాద్: హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం కొనసాగుతుంది. మొదటి రౌండ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యం కనబరుస్తున్నారు. సమీప అభ్యర్థి రామచందర్ రావుపై 1,054 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ లో సురభి వాణీదేవి(టిఆర్ఎస్)కి 17,439 ఓట్లు వచ్చాయి. రామచందర్ రావు(బిజెపి)కు 16,385, ప్రొ, నాగేశ్వర్ కు 8,357, చిన్నారెడ్డి (కాంగ్రెస్)కి 5,082, ఎల్. రమణ (టిడిపి)కి 929 ఓట్లు పడ్డాయి. మొదటి రౌండ్ లో 3,374 చెల్లని ఓట్లు పడగా, 56,006 ఓట్లతో మొదటి రౌండ్ ఓట్ల లెక్కిపు పూర్తి అయింది. ఒక్కో రౌండ్ లో 56 వేల చొప్పున మొత్తం 7 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తున్నారు.

Telangana Graduate MLC Election Results 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News