Thursday, April 25, 2024

ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు: ముందంజలో పల్లా

- Advertisement -
- Advertisement -

Telangana Graduate MLC Election Results 2021

హైదరాబాద్‌: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లారాజేశ్వర్‌రెడ్డి దూసుకుపోతున్నారు. మూడో రౌండ్‌లో పల్లాకు 15,558 ఓట్లు వచ్చాయి. తీన్మార్‌ మల్లన్న (నవీన్‌కుమార్‌)కు 10,748, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 11,032, బిజెపి అభ్యర్థి ప్రేమేందర్‌కు 6,615, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 4,354 ఓట్లు పడ్డాయి. 2,789 చెల్లని ఓట్లను గుర్తించారు. మూడు రౌండ్లలో కలిపి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లాకు 47,545, నవీన్‌కుమార్‌కు 34,864, కోదండరామ్‌కు 29,560 ఓట్లు పోలయ్యాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప అభ్యర్థిపై 12,681 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Telangana Graduate MLC Election Results 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News