Friday, April 19, 2024

సిఎం కెసిఆర్ పరిధిలోకి వైద్యారోగ్యశాఖ

- Advertisement -
- Advertisement -

Telangana Health Ministry under CM KCR

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి ఈటల రాజేందర్ శాఖ కేటాయిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం  నిర్ణయం తీసుకున్నారు. సిఎంకు వైద్యారోగ్యశాఖ కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీచేశారు. సిఎం కెసిఆర్ సిఫారసుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈటల ఏశాఖ లేని మంత్రిగా ఉన్నారు. మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న మంత్రిపై సిఎంకు అసైన్డ్ దారులు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుతో సమగ్ర విచారణకు సిఎం ఆదేశించారు. భూకబ్జా ఆరోపణలపై విచారణ తుదిదశకు చేరుకుంది. అచ్చంపేట అసైన్డ్ భూముల కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని కలెక్టర్ హరీష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News